ఆల్ ఇండియా యునైటెడ్ క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్ (AIUCRC) ఆధ్వర్యంలో నిర్వహించి…
ఆల్ ఇండియా యునైటెడ్ క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్ (AIUCRC) ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇండియన్ క్రిస్టియన్ డే – 2026” వేడుకలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు గౌరవ అతిథిగా ప్రత్యేక ఆహ్వానం అందుకొని కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రైస్తవ సంఘ పెద్దలు, మత గురువులు, ప్రముఖులతో కలిసి భారత దేశ అభివృద్ధిలో క్రైస్తవ సమాజం అందిస్తున్న సేవలను కొనియాడుతూ, జాతీయ ఐక్యత, సామరస్యం, సోదరభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
🌹 ఉర్స్-ఏ-షరీఫ్ సందర్భంగా దర్గా సందర్శన 🌹
పవిత్ర ఉర్స్-ఏ-షరీఫ్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు హజ్రత్ సయ్యద్ షా మీర్ మహమ్మద్ షాఫజల్ దర్గాను సందర్శించి, దర్గా పీఠాధిపతి హజ్రత్ మహమ్మద్ సనాఉల్లా షా ఖలీఫా ఖాద్రీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరాలని ప్రార్థించారు. సమాజంలో ప్రేమ, సామరస్యం, మానవతా విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.
దర్గా పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు ఉర్స్ మహోత్సవాల పవిత్రతను కొనియాడుతూ, ఈ వేడుకలు ప్రజల్లో ఐక్యతాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
🌹 ఉర్స్-ఏ-షరీఫ్ సందర్భంగా దర్గా సందర్శన 🌹
ఉర్స్-ఏ-షరీఫ్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు తాహెర్ గుల్షన్ దర్గా, జి.బి. మస్జిద్ చౌక్బజార్ను సందర్శించి, దర్గా పీఠాధిపతులు హజ్రత్ సయ్యద్ మహమ్మద్ పాషా గారు మరియు హజ్రత్ సయ్యద్ అతర్ పాషా గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు
వైఎస్సార్సీపీ జిల్లా క్రిస్టియన్ విభాగ అధ్యక్షులు జాన్ విల్సన్ పాల్ గారు, క్ర…
వైఎస్సార్సీపీ జిల్లా క్రిస్టియన్ విభాగ అధ్యక్షులు జాన్ విల్సన్ పాల్ గారు, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు డేనియల్ గారు, చర్చి పాస్టర్లు మరియు ఇతర ప్రముఖులు వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు వివిధ సామాజిక, రాజకీయ మరియు ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతం, మైనారిటీల సంక్షేమం తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సమావేశాన్ని విజయవంతంగా ముగించారు.
అహ్మద్ అలీ ఖాన్ గారిని కలిసిన జాన్ విల్సన్ పాల్ గారు, డేనియల్ గారు, చర్చి పాస్టర్లు మరియు ఇతర ప్రముఖులు పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం విశేషం.
పవిత్రమైన నవాబ్ సాబ్ దర్గా ఉర్సు మహోత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా మరియు ఆధ్య…
పవిత్రమైన నవాబ్ సాబ్ దర్గా ఉర్సు మహోత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
ఈ రోజు నవాబ్ సాబ్ దర్గా పీఠాధిపతి షాలు గారు, పాపా గారు, ఖాన్ సాబ్ గారు మరియు కొత్తపేట మున్నా గారి ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు ఉర్సు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు, అభిమానులు ఎంతో ప్రేమాభిమానాలతో ఘన సన్మానం చేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులు, పెద్దల దీవెనలు ఎల్లప్పుడూ మరింత బాధ్యతతో ప్రజాసేవ చేయడానికి ప్రేరణనిస్తాయి.
సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర ఉర్సు మహోత్సవాలు శాంతి, సౌభ్రాతృత్వం మరియు ప్రజలందరికీ సుఖసంతోషాలు తీసుకురావాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము. 🤲✨
కర్నూలు ప్రజానీకానికి ఈద్ ముబారక్ 🌙✨
పవిత్రమైన ఈద్-ఉల్-అజ్హా సందర్భంగా కర్నూల్ ఓల్డ్ ఈద్గా వద్ద అందరితో కలిసి ఈద్ నమాజ్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.
ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిలో సుఖసంతోషాలు నింపాలని, ప్రతి మనసులో ప్రేమ, శాంతి, సోదరభావం పెంపొందాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. కర్నూల్ నగరం ఎల్లప్పుడూ ఐక్యతకు, సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరుకుంటున్నాను.
అహ్మద్ అలీ ఖాన్
సిటీ ప్రెసిడెంట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుక…
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని కర్నూలులో ని పాత బస్టాండ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
అంబేద్కర్ గారి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు, పార్టీ నేతలు, కార్యకర్తలు
ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు కర్నూల్ నగర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అహ్మద్ అలీ ఖా…
ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు కర్నూల్ నగర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నటువంటి సిఎస్ఐ క్రైస్ట్ చర్చి నందు ప్రార్థనలలో పాల్గొని తన కుటుంబం మరియు కర్నూలు ముస్లింమైనారిటీ ల తరపున క్రైస్తవ సోదరులకు, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అహమ్మద్ అలీ ఖాన్ గారు CSI క్రైస్ట్ చర్చి యొక్క ప్రార్థన టవర్ నిర్మాణము నిమిత్తము 50 వేల రూపాయలు విరాళము ఇవ్వటం జరిగినది. తదుపరి నంద్యాల డయాసిస్ బిషప్ గారైన ది రైట్ రెవరెండ్ K.సంతోష్ ప్రసన్న రావు గారు అహమ్మద్ అలీ ఖాన్ గారికి ప్రత్యేక ప్రార్థన ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగినది. మరియు CSI క్రైస్ట్ చర్చ్ 1&2 జాయింట్ చైర్మన్ మరియు డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్M. రాజేంద్ర బాబు గారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ నాయకులు చర్చిని దర్శించి ఈస్టర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా శుభపరిణామం అంటూ అలీ ఖాన్ గారిని సంఘానికి పరిచయం చేయటం జరిగినది. ప్రార్థన అనంతరం అహ్మద్ అలీ ఖాన్ గారు మాట్లాడుతూ క్రిస్టియన్ మైనారిటీ సోదరులను ఈస్టర్ పండుగ సందర్భంగా కలుసుకొని ఈ రీతిగా ఏసుక్రీస్తు ప్రభువు త్యాగము మరియు పునరుద్దానమును జ్ఞాపకం చేసుకుంటూ మైనారిటీ సోదరులతో క్రీస్తు ప్రేమను పంచుకోవటం చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ విభాగపు స్టేట్ జనరల్ సెక్రెటరీ బైనగారి జాన్ విల్సన్ పాల్ గారు, స్టేట్ వైఎస్ఆర్సిపి జాయింట్ సెక్రెటరీ (క్రిస్టియన్ వింగ్) Dr. చౌలం సందీప్ గారు మరియు క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు బైనగారి జాషువా డానియల్ గారు మరియు చర్చి సెక్రటరీ పెర్సీ ఇమ్మానియేల్ గారు ట్రెజరర్ జక్కం భాగ్యనాథ్ గారు మరియు CSI క్రైస్ట్ చర్చి 1&2 సంఘ కమిటీ పెద్దలు మరియు సంఘ సభ్యులు పాల్గొనడం జరిగినది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు, కర్నూలు నగర అధ్యక్షు…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ గారు టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికినా కూడా ఆయన ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రవర్తన సభ్య సమాజానికి అవమానకరమని, సిగ్గుచేటుగా ఉందని ఖాన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వ్యక్తి పవిత్రమైన టిటిడి వంటి సంస్థకు చైర్మన్గా కొనసాగడం సరికాదని, మహిళల గౌరవాన్ని అవమానపరిచినందుకు వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఖాన్ గారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా, కర్నూలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి విజయ మనోహరి గారు, నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు మరియు పలువురు సీనియర్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
రంజాన్ మాసంలో మనం పాటించిన ఉపవాసం, ప్రార్థనలు మన హృదయాలను పవిత్రం చేస్తాయి.
రంజాన్ మాసంలో మనం పాటించిన ఉపవాసం, ప్రార్థనలు మన హృదయాలను పవిత్రం చేస్తాయి.
ఈ పవిత్ర ఈద్ పండుగ మీ జీవితంలో ప్రేమ, దయ, శాంతి నింపాలని కోరుకుంటూ… ఈద్ ముబారక్!
కర్నూలు నగరంలోని హజ్రత్ సయ్యద్ షా ఇషాక్ సనౌల్లా ఖాద్రీ రోజా దర్గా షరీఫ్లో వైభ…
కర్నూలు నగరంలోని హజ్రత్ సయ్యద్ షా ఇషాక్ సనౌల్లా ఖాద్రీ రోజా దర్గా షరీఫ్లో వైభవంగా నిర్వహించిన 536వ ఉర్స్-ఏ-షరీఫ్ మహోత్సవానికి హాజరై, పుణ్యక్షేత్రంలో నా వినమ్ర ప్రార్థనలు సమర్పించుకున్నాను…
*మహా శివరాత్రి శుభాకాంక్షలు*
ఆ దేవదేవుని ఆశీస్సులతో మీకు, ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… అందరికీ " *మహా శివరాత్రి* " శుభాకాంక్షలు...
అహ్మద్ అలీ ఖాన్
నగర అధ్యక్షులు
వై.యస్.ఆర్. సి.పి
కర్నూల్
కర్నూలులో జమియత్ ఉలమా-ఇ-హింద్ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగతం & సమాజ సంస్కరణలో మన బా…
కర్నూలులో జమియత్ ఉలమా-ఇ-హింద్ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగతం & సమాజ సంస్కరణలో మన బాధ్యతలు అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. గౌరవనీయ అతిథులు హజ్రత్ మౌలానా తాహెర్ హుస్సేన్ రషాది సాహెబ్ (బెంగళూరు), మౌలానా ముఫ్తీ మహ్మూద్ జుబైర్ ఖాస్మీ సాహెబ్ (జనరల్ సెక్రటరీ, జమియత్ ఉలమా-ఇ-హింద్ – తెలంగాణ & ఆంధ్రప్రదేశ్), అడ్వకేట్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ సాహెబ్ మరియు ఇతర పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనాబ్ ఎ. ఎం.డి. ఇమ్తియాజ్ సాహెబ్, ఐఏఎస్ గారు రచించిన “అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈరోజు ఉదయం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరం నందు వివిధ చర్చ…
ఈరోజు ఉదయం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరం నందు వివిధ చర్చి లలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని, క్రైస్తవ సోదర–సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు.
ప్రభు యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, త్యాగం, సౌభ్రాతృత్వం విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ క్రిస్మస్ ప్రతి ఇంటికి ఆనందం, శాంతి, ఆశీర్వాదాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
కర్నూలు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ గారు ప్రీ-క్రిస్మస్ వేడు…
కర్నూలు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ గారు ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా దీపాల వెలుగులో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమానికి హాజరయ్యారు. నా క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈరోజు కర్నూల్ సిటీ వైసిపి అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ గారు దేవా నగర్ లోని ఈసీ వ…
ఈరోజు కర్నూల్ సిటీ వైసిపి అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ గారు దేవా నగర్ లోని ఈసీ విజయ్ కుమార్ గారీ వినాయకుడు విగ్రహం దగ్గర పూజలు నిర్వహించడం జరిగినది అలాగే అన్నదానం కార్యక్రమం జరిగినది
ఇట్లు మీ అడ్మిన్
కర్నూల్