ఫస్ట్ శాటిలైట్ ఆవాజ్ టీవీ ఉర్దూ ఛానల్ ప్రారంభించిన సందర్భంగా, వైఎస్సార్ కాంగ్ర…
ఫస్ట్ శాటిలైట్ ఆవాజ్ టీవీ ఉర్దూ ఛానల్ ప్రారంభించిన సందర్భంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్ గారు ఆవాజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించి, ఛానల్ చైర్మన్ శ్రీ ఎస్. మహబూబ్ బాషా గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా అహ్మద్ అలీ ఖాన్ గారు మాట్లాడుతూ, ఉర్దూ భాషా పరిరక్షణ, అభివృద్ధి మరియు సమాజానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించే శక్తివంతమైన వేదికగా ఆవాజ్ టీవీ ఎదగాలని ఆకాంక్షించారు. మీడియా రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ, ఉర్దూ భాషా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే బాధ్యతను ఈ ఛానల్ విజయవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.
అలాగే, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కృషి ఫలించి ఆవాజ్ టీవీ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందే ప్రముఖ ఉర్దూ ఛానల్గా అవతరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆవాజ్ టీవీ ఉర్దూ ఛానల్కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.
అహ్మద్ అలీ ఖాన్ పోస్ట్ చేసినది, ఆయన రాసినట్లుగానే ప్రచురించబడింది.
అసలు పోస్ట్ చూడండి →